News April 7, 2025
చపాతీలు చేయలేదని చితకబాదిన టీచర్

చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం టౌన్ రామవరం గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు 8వ తరగతి విద్యార్థినులను చపాతీలు చేసేందుకు ఓ టీచర్ నిద్రలేపింది. కొందరు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నిద్ర లేవలేదు. ఆ సాకుతో ఈ 21 మందిని గదిలో కర్రతో చితక బాదిందని పేరెంట్స్ ఆందోళన చేశారు.
Similar News
News January 16, 2026
IFFCOలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 16, 2026
ముత్యపు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు

చంద్రుడికి ప్రతీక ముత్యాన్ని భావిస్తారు. ఆ ఉంగరం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. అసలైన ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగించి సోమవారం ధరిస్తే మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయట. ఇది కోపం, ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు ఇది మేలు చేస్తుందట. నకిలీ ముత్యంతో లాభాలు ఉండవట.
News January 16, 2026
డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.


