News April 7, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్

వేసవి కాలం దృష్ట్యా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి సూచించారు. వేసవి కాలంలో సంబంధిత శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవికాలంలో వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News April 8, 2025
కాకినాడ: వీడు మామూలోడు కాదు..!

బిక్కవోలు జగనన్న కాలనీలో నిన్న ఓ యువకుడు గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన సూర్యప్రకాశ్ 10వ తరగతి వరకు చదివాడు. కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ బైక్లు దొంగలిస్తున్నాడు. మరోవైపు గంజాయి వ్యాపారానికి తెరలేపాడు. దొంగతనం చేసిన బైకును కె.పెదబయలుకు చెందిన పంతులబాబు అనే వ్యక్తికి ఇచ్చి గంజాయి తీసుకుని బిక్కవోలుకు రాగా పోలీసులకు దొరికాడు.
News April 8, 2025
ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహ, కూమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను స్నేహ ఇన్స్టాలో పోస్ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు అభిమానుల నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. HAPPY BIRTH DAY ANNA అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
News April 8, 2025
జహీరాబాద్: యువకుడి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.