News April 7, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Similar News
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్లైన్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.
News November 8, 2025
ఆ MLAలు ఏం చేస్తున్నట్లు?

AP: CM <<18235116>>తాజా వ్యాఖ్యల<<>>తో ఆ ‘48మంది MLAలు’ ఎవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నెలలో ఒకట్రెండు రోజుల పాటు పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలోనూ పాల్గొనలేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగే నేతలు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్లు? అని నిలదీస్తున్నారు. అయితే MLAలపై చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? అని అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
News November 8, 2025
USలో 10 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత

AI, ఆటోమేషన్, ఇన్ఫ్లేషన్, టారిఫ్లు.. వెరసి US జాబ్ మార్కెట్ సంక్షోభంలో పడింది. OCTలో 1,53,074 జాబ్స్కు కోత పడినట్లు ‘ఛాలెంజర్ గ్రే క్రిస్టమస్’ తెలిపింది. SEPతో పోలిస్తే 3 రెట్లు అధికమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకు లేఆఫ్ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత అత్యధిక లేఆఫ్లు ఇవేనని చెప్పింది. కాగా గత 2 ఏళ్లతో పోలిస్తే జాబ్ మార్కెట్ ఇప్పుడే స్లో అయినట్లు నిపుణులు పేర్కొన్నారు.


