News April 7, 2025

MNCL: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో సోమవారం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, 65 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 390 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో చేరగా.. 7,280 పేపర్లు మూల్యాంకనం చేశారు. మూల్యాంకనాన్ని డీఈఓ యాదయ్య పర్యవేక్షించారు.

Similar News

News December 30, 2025

మేడారంలో మాకు ఏందీ ఈ గోస!

image

మేడారం జాతరకు మరో 30 రోజుల సమయం ఉంది. సంక్రాంతి తర్వాత మేడారంలో పోలీసు బందోబస్తు క్యాంపు ఏర్పాటు చేస్తారు. ములుగు జిల్లా ఆర్ముడ్ పోలీసులు ఇప్పటి నుంచే క్యాంపు పెట్టాలంటూ ఆదేశాలు రావడంతో సిబ్బంది ఇంత అడ్వాన్సుగా మమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండటంతో ఇబ్బంది పడుతున్నట్టు వారంటున్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాకే బందోబస్తు పెట్టాలని వారంటున్నారు.

News December 30, 2025

నరసరావుపేట: ‘వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు’

image

వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. 9552300009 వాట్సప్ నంబర్ ద్వారా పనిచేస్తున్న ‘మన మిత్రా’ యాప్‌లో 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700కి పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 30, 2025

ఆదోని-1, 2: ఏ మండలంలో ఏ గ్రామాలు!

image

ఆదోనిని ప్రభుత్వం 2 మండలాలుగా విభజించింది. ఆదోని-1, 2 మండలాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
★ ఆదోని మండలం-1లోని గ్రామాలు:
☞ ఆదోని, మండిగిరి, S.కొండాపురం, కల్లుబావి, వెంగళాపురం, పర్వతాపురం, ఇస్వీ, గోనబావి, సలకలకొండ, విరుపాపురం, దొడ్డనగేరి, సాంబగల్లు, దిబ్బనకల్లు, పెసలబండ, నెట్టేకల్లు, అరేకల్లు, బైచిగేరి, వువ్వనూరు, మాంత్రికి, దెయ్యాలగూడెం, కపటి, బసరకోడు, చిన్నపెండేకల్లు, సుల్తానపురం. <<18709003>>cont..<<>>