News April 8, 2025

IPL: పోరాడి ఓడిన ముంబై

image

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్య(15 బంతుల్లో 42) వీరోచిత పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4 వికెట్లు, దయాల్, హేజిల్‌వుడ్ చెరో 2, భువీ ఒక వికెట్ తీశారు.

Similar News

News April 8, 2025

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

image

TG: త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక రూ.వేల కోట్ల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ ఉన్నారన్నారు. ఒకరు ఢిల్లీ నేత చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందని ఆరోపించారు.

News April 8, 2025

మోడల్ పర్యాటక కేంద్రంగా కురిడి: పవన్

image

AP: కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కురిడి గ్రామ పర్యటనలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రజలు కోరగా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విలేజ్‌ను మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

News April 8, 2025

పల్లా, రాజయ్యకు కడియం సవాల్

image

TG: భూముల కబ్జాకు ప్రయత్నించారనే BRS నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఆరోపణలపై MLA కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ‘నాపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి విడిచి మీకు గులాంగిరి చేస్తాను. లేకపోతే మీరు నాకు గులాంగిరి చేయాలి’ అని వారికి సవాల్ విసిరారు. చీము నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని కడియం స్పష్టం చేశారు.

error: Content is protected !!