News April 8, 2025
సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా?

సమ్మర్లో ఎలక్ట్రానిక్ పరికరాలు వేగంగా వేడెక్కుతుంటాయి. వాటిలో మనం నిత్యం ఉపయోగించే మొబైల్ ఫోన్పై వేడిమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫోన్పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. యాప్స్ను ఎక్కువగా వాడకుండా ఉండాలి. వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయాలి. వేడెక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజర్లో ఉంచకూడదు. కారులో ఫోన్ పెట్టి వదిలేయకండి
Similar News
News February 3, 2026
పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

T20 WCతో భారత్ మ్యాచ్ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.
News February 3, 2026
ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్లాండ్పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.
News February 3, 2026
పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<


