News April 8, 2025

దస్తూరాబాద్: అత్యంత వైభవంగా రథోత్సవం

image

శ్రీ రామనవమి ఉత్సవాలలో భాగంగా రేవోజిపేట గ్రామంలో శ్రీ రాముల వారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ హరిహర క్షేత్రం నుంచి ఆలయ పుర విధుల గుండా డప్పు చప్పుళ్లతో డీజే మధ్య స్వాముల నృత్యల రథోత్సవాన్ని ఊరేగించారు. మహిళలు స్వామి వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకుడు వంశీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

కోరుట్ల: కత్తిపోట్ల ఘటన.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా కోరుట్ల రవీంద్రరోడ్‌కు చెందిన ఇర్యాల సత్యనారాయణ(49)పై ఇటీవల అదే కాలనీకి చెందిన గంగనర్సయ్య పాత కక్షల కారణంగా <<16876293>>కత్తితో దాడి<<>> చేశాడు. ఆ దాడిలో గాయపడిన సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2025

సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల

image

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు ఏఈ కృష్ణయ్య ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

News July 5, 2025

రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్‌ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.