News April 8, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,38,094 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.59,833 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.71,195, అన్నదానానికి రూ.7,066 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News February 28, 2026
సిద్దిపేట: పడిపోయిన టమాటా ధర

సిద్దిపేటలోని రైతు బజార్లో గత వారంతో పోలిస్తే కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. వారం క్రితం కిలో రూ.20 వరకు పలికిన టమాట ధర ప్రస్తుతం రూ.8 పడిపోయింది. వంకాయ రూ.20, బెండకాయ రూ.34, మిర్చి రూ.40, కాకరకాయ రూ.40కి చేరుకుంది. బీరకాయ రూ.48, క్యాబేజీ రూ.15, దొండకాయ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. క్యారెట్ రూ.24, ఆలుగడ్డ రూ.20, ఉల్లిగడ్డ రూ.20, చిక్కుడు రూ.44, అల్లం రూ.70, ఎల్లిగడ్డ రూ.140 చొప్పున ఉన్నాయి.
News February 28, 2026
GNT: ఒకప్పటి ద(ర్జీ)ర్జానే వేరయా..!

కార్యం ఏదైనా కుట్టిన దుస్తులు అంటే గుర్తొచ్చేది దర్జీ. కాల క్రమేణా ప్రజలు రెడీమేడ్పై ఆసక్తి చూపిస్తున్నారు. దర్జీ కూలీ, రెడీమేడ్ దుస్తులు అటు, ఇటుగా ఒకటే అవుతుండటంతో అప్పటికప్పుడు దొరికే రెడీమేడ్ దుస్తులు కొంటున్నారు. ఒకప్పుడు దర్జీకి కొలతలు ఇవ్వడం, స్టిచ్చింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? అని ఎదురు చూడటం అంతా ఆసక్తిగా ఉండేది. నేడు టైలర్స్ డే ఈ సందర్భంగా వారితో మీకు ఉన్న అనుబంధం కామెంట్ చేయండి.
News February 28, 2026
పాతకక్షల భగ్గు: భీమవరంలో దారుణ హత్య

2022 డిసెంబరులో రఘు సోదరుడు ఏసు హత్యతో రెండు వర్గాల మధ్య కక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 17న గోవింద్, తన సోదరుడు విజయ్తో కలిసి భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తుండగా.. గొల్లవానితిప్ప రోడ్డులోని కనకదుర్గ ఆలయం వద్ద రఘు తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ అక్కడి నుంచి పరారయ్యాడు.


