News March 26, 2024
రుద్రవరం: వడ దెబ్బతో 18 నెలల చిన్నారి మృతి

రుద్రవరం మండల కేంద్రంలోని బ్రహ్మయ్య ఆచారి, రాజేశ్వరి దంపతుల కుమారుడు లక్ష్మీ నరసయ్య ఆచారి 18 నెలలు వడదెబ్బ సోకి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సోమవారం అహోబిలంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు వెళ్లి తలనీలాలు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం చూస్తే చిన్నారి కదలక పోవడంతో స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News March 15, 2026
ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
News March 15, 2026
కర్నూలు: నకిలీ మెసేజ్లతో జాగ్రత్త!

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.
News March 15, 2026
విద్యుత్ బిల్లులపై నకిలీ మెసేజ్లకు మోసపోవద్దు: శివశంకర్

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.


