News March 26, 2024
సింహాచలం అప్పన్న హుండీ ఆదాయం రూ.1.29కోట్లు

సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ద్వారా ఆదాయం రూ.1,29,30,598 లభించింది. మంగళవారం ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. 89 గ్రాముల బంగారం, 9 కిలోల 350 గ్రాములు వెండి లభించింది. అలాగే వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా గల పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం రూ.8,10,455 లభించింది.
Similar News
News April 3, 2026
విశాఖ: ప్రాణాలు కాపాడిన 112 కాల్

కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మహారాణిపేట పోలీసులు కాపాడారు. గురువారం రాత్రి 112కి అందిన సమాచారంతో సీఐ దివాకర్ యాదవ్ బృందం గోకుల్ పార్క్ బీచ్కు చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారి సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.
News April 3, 2026
రక్షణ శాఖ మంత్రి పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News April 3, 2026
రక్షణ శాఖ మంత్రి పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.


