News April 8, 2025
గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

గాంధారి మండలం చందాపూర్ తండాకు రాజి అనే వ్యక్తి అమీనా బేగం అనే మహిళను అడవిలోకి తీసుకెళ్లి చితక బాదాడు. అరుపులు విన్న కొంతమంది ఆమెను గాంధారి ఆసుపత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ మరణించిందని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పోలీసుల వివరాలు.. హైదరాబాద్లో వారికి పరిచయం ఏర్పడిందని రాజి తన నాలుగేళ్ల బాబును ఆమె వద్ద ఉంచి వెళ్లగా ఆ మహిళా బాబును అమ్మేసిందని అనుమానంతో ఆమెపై దాడి చేశాడు.
Similar News
News April 8, 2025
రోడ్డు మార్గాన బెంగళూరుకు వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి నుంచి రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరారు. ఇవాళ ఉదయం పాపిరెడ్డిపల్లెకు చేరుకోగా వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ ఫ్రంట్ గ్లాస్ పగిలిపోయి సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరారు.
News April 8, 2025
NLG: రైతులను వేధిస్తున్న సర్వేయర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉండడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. సర్వేకు దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ తగాదాలు తీరాలన్న.. గట్టు పంచాయతీలు వచ్చిన భూ సర్వే చేసి పరిష్కరిస్తారు. కాగా జిల్లాలో సర్వేయర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 8, 2025
పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: రోజా

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ‘ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలి. దీర్ఘాయుష్సుతో ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.