News April 8, 2025
పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: ఆకుల రాజేందర్

హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ పి.ప్రావిణ్యను కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో కలిసి పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బదిలీలు చేయడం సరికాదని కోరారు.
Similar News
News April 18, 2025
తిరుమలలో TTD ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

AP: తిరుమలలో TTD ఛైర్మన్ BR నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. TTD సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను ఓ భక్తుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లడ్డూ, అన్నప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని కొందరు తెలిపారు. అటు, దర్శన క్యూలైన్లనూ ఆయన పరిశీలించి.. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
News April 18, 2025
వసతి గృహంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.
News April 18, 2025
‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.