News April 8, 2025

బెల్లంపల్లి: ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన ఇద్దరిపై కేసు

image

బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. SHO మాట్లాడుతూ..సర్వే నం.170PP ఆక్రమించి ఇల్లు కడుతున్న SK.మహబూబ్ బీ, అమానుల్లా ఖాన్ అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశామని SHOపేర్కొన్నారు.

Similar News

News December 28, 2025

బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

image

బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్‌, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.

News December 28, 2025

కాకినాడ@2025: రాజకీయ షాక్‌లు.. ప్రకృతి వైపరీత్యాలు!

image

2025లో కాకినాడ జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వైసీపికి షాక్ ఇస్తూ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది బర్డ్ ఫ్లూ, స్క్రబ్ టైఫస్ వ్యాధులు ప్రజలను భయపెట్టగా, మొంథా తుఫాన్ రైతాంగాన్ని దెబ్బతీసింది. ఆరేళ్ల తర్వాత రేషన్ షాపులు పునఃప్రారంభం కావడం, ఎస్పీ బదిలీ వంటి అంశాలు ఈ ఏడాది విశేషాలుగా నిలిచాయి.

News December 28, 2025

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: అర్బన్‌ ఏవో

image

కామేపల్లి మండలం బాసిత్‌నగర్‌ రైతులకు సరఫరా అయిన నకిలీ విత్తనాల వ్యవహారంపై అధికారులు స్పందించారు. దీనిపై ఖమ్మం అర్బన్‌ ఏవో కిషోర్‌ వివరణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, అధికారులు పంటను సందర్శించి నివేదిక అందజేస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా నకిలీ విత్తనాలు విక్రయించిన సంబంధిత దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.