News April 8, 2025
ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ గత కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తన తండ్రి మహమ్మద్ అలీ అహ్మద్ ఆచూకీ తెలిపామని ఆయన వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 17, 2025
ఈ రీజనింగ్ పజిల్కు ఆన్సర్ తెలుసా?

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ పజిల్లో బోట్, రింగ్, స్టార్కు ఒక్కో దానికి ఒక్కో నంబర్ కేటాయించారు. దాని ఆధారంగా కుడివైపు ఆన్సర్ ఇస్తూ వచ్చారు. తొలి మూడింటి ఆధారంగా 4, 5వ దాని సమాధానాలు కనుక్కొని COMMENT చేయండి.
News April 17, 2025
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో జమ్మికుంట విద్యార్థికి అరుదైన గౌరవం

జమ్మికుంట పట్టణానికి చెందిన 9వ తరగతి చదువుతున్న జోయల్ మెక్కు గిన్నిస్ బుక్లో అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్ 1, 2024లో పియానో వాయించే పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయిలో మ్యూజిక్ ప్రదర్శనలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో స్థానం పొందాడు. కీబోర్డ్ సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేసి స్థానం సాధించారు. జోయల్ మెక్ను స్కూల్ కరస్పాండెంట్ సునీల్ కుమార్, తల్లిదండ్రులు అభినందించారు.
News April 17, 2025
NRML: ఉద్యోగాలు.. APPLY NOW

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.