News April 8, 2025
సిరిసిల్ల: ఇసుక రీచ్లు ప్రారంభించాలి: కలెక్టర్

రేపటి నుంచి పదిర, కొండాపూర్ ఇసుక రీచులను ప్రారంభించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఇసుక రీచ్లపై ఏర్పాటుపై అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇల్లు, పెండింగ్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఎక్కడ కూడా ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News April 17, 2025
ములుగు : భూ భారతి అవగాహన సదస్సులు ఎప్పుడు? ఎక్కడంటే!

ములుగు జిల్లాలో భూభారతి అవగాహన సదస్సుల నిర్వహణ తేదీలను జిల్లా అధికారులు ప్రకటించారు. ఈనెల 17న తాడ్వాయి, 18న వెంకటాపూర్, 19న ములుగు, గోవిందరావుపేట, 21న మంగపేట, ఏటూరునాగారం, 22న వెంకటాపురం, వాజేడు, 23న కన్నాయిగూడెం మండలాలలో భూభారతి చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆయా తేదీలలో ప్రజలు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 17, 2025
పురుషులకు అలర్ట్.. ఈ తప్పు చేయకండి

ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా, మద్యం, సిగరెట్ అలవాట్లు మానేసినా లైంగిక సామర్థ్యం మెరుగుపడటం లేదని చాలామంది పురుషులు బాధపడుతుంటారు. అయితే విటమిన్-D లోపమూ ఇందుకు కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది బోన్స్, రోగ నిరోధక శక్తితో పాటు లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. విటమిన్-డి లెవెల్స్ తగ్గకుండా మెయింటేన్ చేయాలని సూచించింది. పూర్తి వివరాలు ఈ లింక్పై <
News April 17, 2025
నర్సంపేట: రాజకీయ భీష్ముడిగా పేరు.. ఈయన గురించి మీకు తెలుసా?

నర్సంపేటలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా మద్ధికాయల ఓంకార్కు గుర్తింపు ఉంది. 1972 నుంచి 1989 వరకు వరుసగా 5 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి MLAగా (MCPI(U))గెలిచి రికార్డు సృష్టించారు. రాజకీయ భీష్మునిగా పేరు ఉన్న ఈయన.. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. 1924లో జన్మించిన ఆయన 17 OCT 2008లో మరణించారు.