News April 8, 2025

కమలాపురం: సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తులసి రెడ్డి

image

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతి నది ఒడ్డున ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సోమవారం రాత్రి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఐసీసీ సభ్యులు తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అక్కడ ఆయన 12 సంవత్సరాలు నివసించారని తెలిపారు. ఇది మర్చిపోలేని ఘటన అని ఆయన అన్నారు.

Similar News

News April 17, 2025

మైదుకూరులో రోడ్డు ప్రమాదం

image

కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మైదుకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆది రెడ్డి పల్లె గ్రామ శివార్లలో ఓ బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2025

అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు: కడప కలెక్టర్

image

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ప్రణాళికాబద్ధంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

News April 16, 2025

రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం: కలెక్టర్

image

రెవెన్యూ అధికారులు అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం అన్నారు. అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని, మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.

error: Content is protected !!