News March 26, 2024

గుడ్లు ఎక్కువగా తింటున్నారా?

image

రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువగా తింటే మరీ మంచిదని అంటున్నారు. గుడ్లు తినడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు కూడా రావని పేర్కొంటున్నారు. అలాగే గుడ్డు తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. తొడ, కటి వెన్నెముక భాగాల్లోని ఎముకలు దృఢంగా మారతాయని అంటున్నారు. గుడ్డు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొంటున్నారు.

Similar News

News January 20, 2026

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.

News January 20, 2026

₹15 లక్షల భరణం అడిగిన భార్య.. భర్త ఏం చేశాడంటే..

image

భార్య ₹15 లక్షల భరణం అడిగిందని ఉద్యోగానికి రిజైన్ చేశాడో భర్త. కెనడాకు చెందిన దంపతులు సింగపూర్‌లో ఉంటున్నారు. 2023లో అతడు భార్యతో విడిపోయాడు. తనకు, పిల్లల(4)కు కలిపి నెలకు S$20వేలు(₹15L) భరణం ఇవ్వాలని ఆమె అడగడంతో జాబ్ మానేశాడు. 2023లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అతడి వార్షిక జీతం S$8.6 లక్షలు(₹6Cr). ఈ క్రమంలో ఆమెకు S$6.34 లక్షలు(₹4.47Cr) చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.

News January 20, 2026

పెట్టుబడుల గమ్యస్థానం AP: CM CBN

image

AP: బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని మించిన పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని స్పష్టం చేశారు. వెయ్యి KMల సముద్రతీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు రాష్ట్రానికి బలమని పేర్కొన్నారు. 2047కు భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందన్నారు. దావోస్ సమ్మిట్‌లో ఇండియా లాంజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.