News April 8, 2025

వడాలిలో భర్త వేధింపులతో నవవధువు బలవన్మరణం

image

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన గుండాబత్తుల తనుశ్రీ(19) భర్త వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రూ.20వేలు తీసుకురమ్మని, గతంలో పెట్టిన కేసు రాజీ చేసుకోవాలని తన కుమార్తెను వేధింపులు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 17, 2025

VZM: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఈనెల 13న జాయిన్ అయ్యాడు. బుధవారం ఉదయం టిఫిన్ చేసిన తరువాత హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

News April 17, 2025

HYD: BRS కార్పొరేటర్లు ఓటేస్తారా?

image

ఈనెల 23న జరిగే HYD స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటేస్తారో, లేదో అని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, MIM పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అనధికారికంగా MIMకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. BRS ఓటర్లు కాంగ్రెస్ మద్దతిచ్చే MIM వైపు మొగ్గు చూపుతారా? లేక తటస్థంగా ఉంటారా అనేదానిపై రాజకీయంగా చర్చసాగుతోంది.

News April 17, 2025

కరీంనగర్: ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల తేదీలు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 26 ఏప్రిల్ నుంచి మే 5వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!