News April 8, 2025
అన్నమయ్య: రూ.50 పెంపు.. రూ.2.50కోట్ల భారం

అన్నమయ్య జిల్లాలోని పేద ప్రజలకు మరో షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 5లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రూ.853గా ఉన్న సిలిండర్ రూ.903కు చేరడంతో జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.2.50కోట్లకు పైగా భారం పడనుంది. దీనిపై మీ కామెంట్.
Similar News
News April 17, 2025
ALERT: నెత్తురోడుతున్న హైదరాబాద్!

HYDలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 790 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 70 మంది చనిపోవడం గమనార్హం. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
SHARE IT
News April 17, 2025
NLG: వివాహితపై హత్యాయత్నం.. 20ఏళ్లు జైలు

వివాహితపై యాసిడ్తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
News April 17, 2025
NLG: వివాహితపై హత్యాయత్నం.. 20ఏళ్లు జైలు

వివాహితపై యాసిడ్తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.