News April 8, 2025

కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

image

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 17, 2025

ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

News April 17, 2025

NZB: మంత్రి జూపల్లికి BRS జిల్లా అధ్యక్షుడి హెచ్చరిక

image

మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు మార్చుకోవాలని, లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవుని ఖబడ్దార్ అని BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు చేయాలని అడిగిన వారి మీదకు పోలీసులను ఉసిగొల్పి చితకబాదించడం ప్రజా పాలన అంటారా? అని ఆయన మండిపడ్డారు. పోలీసుల లాఠీచార్జికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

News April 17, 2025

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్: NZB CP

image

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిజామాబాద్ CP సాయి చైతన్య వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారని పేర్కొన్నారు. ఇకపై మైనర్ల డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

error: Content is protected !!