News April 8, 2025

GNT: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వడ్లమూడి నుంచి శుద్ధపల్లికి వెళ్లే దారిలో రేపల్లె-సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. తెలుపు, నీలం రంగు గళ్ల చొక్కా, నీలం రంగు లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 31, 2025

GNT: తప్పుడు ప్రచారాలపై పోలీస్ దృష్టి

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పోలీసులపై తప్పుడు పోస్టులు పెరగడంతో గుంటూరు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను సభ్యులుగా చేర్చి బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో 15 గ్రూపులను గుర్తించారు. తొలి దశలో 10 గ్రూప్ అడ్మిన్‌లకు నోటీసులు జారీ చేశారు. లాలాపేట, నగరంపాలెం, అరండల్‌పేట, పొన్నూరు, పెదకాకానిలో నివసించే అడ్మిన్‌లను విచారణకు పిలిపించారు.

News October 31, 2025

నిన్నటి దాకా తుఫాన్.. ఇప్పుడు కృష్ణా నదికి వరద

image

నిన్నటివరకు తుఫాన్ కష్టాలు ఎదుర్కొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఇప్పుడు వరదల నేపథ్యంలో భయాందోళనలో ఉన్నారు. ప్రకాశం బరేజ్‌కు భారీగా నీటి ప్రవాహం చేరడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళనలో గురవుతున్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే పంటలు దెబ్బతినగా, ఇప్పుడు కృష్ణా నదికి వరద పెరగడంతో, ఈసారి పంట పరిస్థితి ఎలా ఉండబోతుందో అని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

News October 31, 2025

GNT: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తుపాన్ సమస్యలపై ఆరా

image

తుపాన్ కారణంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌ను సైతం ఉపయోగిస్తోంది. యాప్ ద్వారా సంక్షిప్త సందేశాలను ప్రజలకు పంపిస్తోంది. తుపాను కారణంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ సందేశాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.