News April 8, 2025
కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News February 23, 2026
అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 45 కేంద్రాల్లో 8,157 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 23, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.
News February 23, 2026
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 16 కేంద్రాలు: ఇన్ఛార్జ్ కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షాల నిర్వహణకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ 4046 మంది, సెకండ్ ఇయర్ 4060 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమనే నిబంధన తొలగించారని, నిర్ణీత సమయానికి 5 నిమిషాలలోగా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని ఆమె సూచించారు.


