News April 8, 2025

తాడేపల్లి: మర్డర్ కేసు నిందితుల అరెస్ట్

image

తాడేపల్లి సీతానగరంలో జరిగిన ఇట్టా వర్ధన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొత్తిక భరత్, ఇసుకపల్లి ప్రకాష్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య పూర్వం జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఉద్భవించిన వివాదం వల్ల జరిగిందని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ సోమవారం వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.

Similar News

News November 5, 2025

ఏపీలో అగ్రస్థానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

image

క్యూఎస్‌ ఏషియా సంస్థ విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సర ర్యాంకింగ్స్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 761-770 ర్యాంక్‌ సాధించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ 801-850 ర్యాంకుల్లో, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ 851-900 ర్యాంక్‌లో, శ్రీకృష్ణ యూనివర్సిటీ 1001-1100 ర్యాంక్‌లో నిలిచాయి. ఈ విజయంపై రిజిస్ట్రార్ సింహాచలం అభినందించారు.

News November 5, 2025

జగిత్యాల: శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివ లింగం ఎక్కడుందంటే?

image

త్రేతాయుగంలో లంక యుద్ధం అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వెళ్తూ ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పట్లో ఆయన రాక్షస సంహారం చేసిన పాప విమోచనార్థం శివారాధన చేయాలని సంకల్పించి, స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే శ్రీ రామలింగేశ్వర స్వామి. కాలక్రమేణా ఆ ప్రదేశం మల్లాపూర్ మండలం “వాల్గొండ”గా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా భక్తులు ఇక్కడికి వచ్చి రామ-శివుల ఆరాధనతో పుణ్యఫలం పొందుతున్నారు.

News November 5, 2025

GNT: ‘కపాస్ కిసాన్’ యాప్‌ ద్వారా సీసీఐకి విక్రయించాలి

image

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్‌ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.