News March 26, 2024
నెల్లూరులో రంగడి తేరు రేపే

ఉమ్మడి నెల్లూరు ప్రజలు ఎంతో ఆనందంగా భాగస్వాములయ్యే రంగడి తేరు (శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం) బుధవారం జరగనుంది. ఉదయం 8.30 గంటలకు సర్వాలంకార శోభితులైన దేవేరుల సమేత రంగనాథుడు విశేషంగా అలంకరించిన రథంలో కొలువుదీరుతారు. అనంతరం గోపురం వీధిలో రైల్వే గేటు వరకు తిరిగి ఆలయం మీదుగా సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు రథోత్సవం సాగనుంది. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు కిమ్స్కు 9మంది చిన్నారుల తరలింపు

నెల్లూరు జిల్లా ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించారు. 9మంది చిన్నారులను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించారు. ఆ ఏరియాలో ఎలాంటి కాంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకువాలని ఆదేశించారు. తిరుపతి నుంచి ఫోరెన్సిక్ టీంను పిలిపించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
News March 2, 2026
నెల్లూరు: ఒక్క రోజులోనే రూ.వెయ్యి తగ్గింపు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి కాలం కావడంతో జనవరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరగడంతో ధరల్లో ఊపు వచ్చింది. ఒక్కో బస్తాను రూ.7వేల వరకు విక్రయించారు. హోలీ కారణంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని మార్కెట్లకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ బస్తా ధర ఒక్కరోజులోనే రూ.వెయ్యి పడిపోయింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు.
News March 2, 2026
నెల్లూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

నెల్లూరు జిల్లాలో చాలా మంది కరెంట్ మీటర్లు, నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ రాఘవేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 0861 2320427 నంబర్కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.


