News March 26, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 68 వేల నగదు సీజ్ . @ ధర్మారం మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు. @ వేములవాడలో కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు. @ లైసెన్సుడ్ గన్ లను సరెండర్ చేయాలన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ వివాహితను ట్రాప్ చేసిన ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ ఎస్పీ ఆఫీస్ కు అటాచ్.
Similar News
News March 24, 2026
పారదర్శకమైన ఓటరు జాబితాకు సహకరించండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

ఓటరు జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకత పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపుపై అపోహలు వద్దన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకుని ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
News March 24, 2026
నిబంధనల మేరకే గ్యాస్ సరఫరా జరగాలి: కలెక్టర్

గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. సీతారాంపూర్లోని భారత్ గ్యాస్ గోదామును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News March 24, 2026
సైదాపూర్: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాటిచెట్టుపై నుంచి కిందపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల వేణు ఉదయం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడడంతో వెన్నుపూసతో పాటు, పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


