News April 8, 2025
నిజామాబాద్లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.
Similar News
News January 21, 2026
తెలంగాణ వర్సిటీ పీఆర్ఓగా డాక్టర్ కె.వి. రమణచారి

TU పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO)గా ఇంగ్లీష్ విభాగానికి చెందిన డాక్టర్ కె.వి. రమణచారి బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో పలు కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వహించిన రమణచారి.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వీసీకి, రిజిస్ట్రార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వర్సిటీ అధికారులు ఆయనను అభినందించారు.
News January 21, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఓటరు జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 21, 2026
NZB: ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లను కేటాయించండి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ పరంగా 50 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం NZB జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవన్నారు. జనరల్ స్థానాల్లో 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.


