News April 8, 2025

2780 ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి రాంబాబుతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రజావాణి ద్వారా 3462 దరఖాస్తులు రాగా వాటిలో 2780 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు.

Similar News

News April 19, 2025

పినపాక: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం- సీతారాంపురం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహన ఢీకొని సీతారాంపురంకి చెందిన కోడి రెక్కల నరసింహ(60) మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

News April 19, 2025

ఏలూరు: మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో.జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో మొత్తం 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310 పోస్టులు భర్తీ చేస్తారు. ఇటీవల జిల్లాకు మంజూరైన 166 స్పెషల్ పోస్టుల భర్తీని డీఎస్సీతో సంబంధం లేకుండా విడుదల చేస్తారు.

News April 19, 2025

ఆ లిస్టులో సెకండ్ ప్లేస్‌కు పాటీదార్

image

నిన్న పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్ IPLలో తక్కువ ఇన్నింగ్స్‌(30)లో 1,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 25 ఇన్నింగ్స్‌లతో GT ప్లేయర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. సచిన్, రుతురాజ్ 3వ స్థానంలో ఉన్నారు. కాగా, ఈ ఏడాది RCBకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాటీదార్ 7మ్యాచుల్లో 209 రన్స్ చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నారు.

error: Content is protected !!