News April 8, 2025
మహబూబ్నగర్: ఈ పురాతన బురుజు.. చరిత్ర తెలుసా..?

కాకతీయుల కాలంలోని సామంత రాజు గోన గన్నారెడ్డి సామ్రాజ్యంలోని రాజ్యశాల గ్రామాన్నే కాలక్రమేణ నేటి మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాలుగా పిలుస్తున్నారు. గ్రామం చుట్టూ 9కోట బురుజులు ఉండేవి. ప్రస్తుతం ఒకటే ఉండగా 6ఫీట్ల బేస్మెంట్ వెడల్పుతో తూర్పు పడమర 31ఫీట్లు, ఉత్తర దక్షిణం 31ఫీట్లు కొలతలతో 50ఫీట్ల ఎత్తుతో భారీగా ఉంటుంది. వీటితో శత్రువుల దాడుల నుంచి ప్రజలను కాపాడేవారని గ్రామస్థులు చెబుతున్నారు.
Similar News
News November 6, 2025
సిరిసిల్ల: ఆఫీసర్కు దక్కిన అరుదైన గౌరవం..!

తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన ఇందిరమ్మ గృహం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. కాగా, కార్యక్రమానికి అధికారులు అన్నీ ఏర్పాట్లను చేసి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో హాజరైన కలెక్టర్ హౌసింగ్ AE అబ్దుల్ హమీద్తో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం జరిపిచండంతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఏఈ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News November 6, 2025
ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ఇక రానట్టేనా!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR రానట్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా కేటీఆరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార పర్వం రేవంత్ vs KTRగా వేడెక్కింది. తండ్రి మరణంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న హరీశ్ రావు ఈ 3 రోజులు యాక్టివ్ కానున్నారు. KCR ఒక్కసారి రావాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా… గెలుస్తామనే ధీమా, అనారోగ్యం కారణంగా ఆయన వచ్చే అవకాశం కనిపించడం లేదు.


