News April 8, 2025
HYDలో పొల్యూషన్.. అదే మన టార్గెట్!

HYD గాలిలో ధూళికణాల స్థాయి తగ్గింపే తమ లక్ష్యమని GHMC కమిషనర్ ఇలంబర్తి అన్నారు. పీఎం-10 స్థాయిని ఘనపు మీటరు గాలిలో 110 మైక్రోగ్రాముల నుంచి 81కి తగ్గించామని, అయితే దీన్ని 60 కంటే తక్కువకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. అప్పుడే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందన్నారు. ఇందులో ప్రతీ పౌరుడు భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు.
Similar News
News November 13, 2025
వరంగల్: మేలు చేసిన సినిమా బంధం..!

ఆయన ఇద్దరితో సినిమా తీశాడు. ఇద్దరికీ ఎంతో దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య ఉన్న కేసును సైతం రాజీ పడేలా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సంచలనాలకు కేరాఫ్గా ఉండే కొండా మురళి దంపతులకు, ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో ఉండే డైరెక్టర్ RGVని కొండా సినిమా దగ్గర చేసింది. ఆ పరిచయంతో శివ రీ రిలిజ్ సందర్భంగా నాగార్జునతో సురేఖపై ఉన్న పరువు నష్టం కేసు రాజీ కోసం ప్రయత్నం చేయడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.
News November 13, 2025
అలంపూర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

అలంపూర్ చౌరస్తా నుంచి బుక్కాపురానికి ప్యాసింజర్తో వెళ్తున్న ఆటో కోనేరు గ్రామానికి దగ్గర్లో అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న 6 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో సకాలంలో ఘటన స్థలానికి ఉండవెల్లి, అల్లంపూర్ 108 అంబులెన్స్లు చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందించి అలంపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తీసుకెళ్లారు.
News November 13, 2025
విశాఖలో 99పైసలకే రహేజాకు 27.10 ఎకరాలు

AP: VSP IT సెక్టార్లో 27.10 ఎకరాలు కేవలం 99 పైసలకే ‘రహేజా’కు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. అదనంగా ఆర్థిక రాయితీలు ఇస్తామంది. పైగా ₹91.20CRతో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తామంది. కాగా ₹2172.26 CRతో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్ నిర్మిస్తామని, 9681 జాబ్లు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ₹కోట్ల విలువైన భూమిని సదుపాయాలు కల్పించి మరీ 99 పైసలకే ‘రియల్’ సంస్థకు ఇవ్వడంపై అనేక ప్రశ్నలొస్తున్నాయి.


