News April 8, 2025
బాంబులు అమర్చాం.. అక్కడికి వెళ్లొద్దు: ‘మావో’ లేఖ

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టపైకి స్థానిక ప్రజలు వెళ్లవద్దని సీపీఐ మావోయిస్టు వెంకటాపురం-వాజేడు కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి తాము కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్లు తెలిపారు. ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలు పోలీసుల మాయమాటలు నమ్మి వేట పేరుతో కర్రెగుట్టలపైకి వెళ్లొద్దని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News November 10, 2025
GNT: క్రికెట్ బ్యాట్తో కొట్టి.. భార్య చంపిన భర్త.!

రియల్ ఎస్టేట్ వ్యాపారి.. క్రికెట్ బ్యాటుతో కొట్టి తన భార్యను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా వాసులైన సి.బ్రహ్మయ్య-కృష్ణవేణి దంపతులు అమీన్పూర్లోని కేఎస్నగర్లో నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి ఓ బ్యాంక్లో పనిచేస్తున్నారు. ఇరువురు దంపతులకు ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉండగా..భార్యతో గొడవ పడిన బ్రహ్మయ్య బ్యాటుతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది.
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.


