News April 8, 2025

ఉద్యాన పంటలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని  రైతులకు సూచించారు. మంగళవారం వీరబల్లి మండలంలోని మాదిరెడ్డిపల్లిలో మామిడితోటలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. అనంతరం మామిడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2025

జిల్లా ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు: కలెక్టర్

image

మొంథా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నందుకు కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాణ నష్టం లేకుండా పని చేసిన అధికారులను, ప్రజలను, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులను, స్వచ్ఛంద సంస్థలను ఆయన అభినందించారు. హెచ్చరికలకు స్పందించి జాగ్రత్త చర్యలు తీసుకున్నందుకు ప్రజలను ప్రశంసించారు.

News November 5, 2025

ఇది ట్రంప్‌కు వార్నింగ్ బెల్!

image

USలోని పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ట్రంప్ ఏమాత్రం ఇష్టపడని సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం ఉన్న జోహ్రాన్ మమ్‌దానీ <<18202940>>న్యూయార్క్ మేయర్‌గా<<>> ఎన్నికయ్యారు. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల <<18202619>>గవర్నర్<<>> ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ నెగ్గడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News November 5, 2025

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

JGTL(D)లో చలి తీవ్రత కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో మన్నెగూడెంలో 20℃, గోవిందారం 20.2, పూడూర్, గొల్లపల్లి 20.3, కథలాపూర్ 20.5, తిరమలాపూర్, పెగడపల్లె 20.6, నేరెళ్ల, మడ్డుట్ల, మల్యాల 20.7, మల్లాపూర్, రాఘవపేట 20.8, జగ్గసాగర్ 21.1, పొలాస, సారంగాపూర్, ఐలాపూర్ 21.2, జగిత్యాల, రాయికల్ 21.4, కోరుట్ల, గోదూరు, బుద్దేశ్‌పల్లి, కొల్వాయి 21.5, మేడిపల్లి 21.6, అల్లీపూర్లో 21.9℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.