News April 8, 2025
బాపట్ల: అన్న క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళీ మంగళవారం అన్న క్యాంటీన్ల నిర్వహణ, శానిటేషన్ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్యాంటీన్లలో భోజన నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రోజువారీ తనిఖీలు నిర్వహించి నివేదికలు అందించాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. క్యాంటీన్ల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న సిబ్బంది తగిన విధంగా స్పందించాలన్నారు.
Similar News
News November 11, 2025
సంగారెడ్డి: నేటి నుంచి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులందరూ జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
News November 11, 2025
NLG: ధాన్యం సేకరణ నిబంధనల ఉల్లంఘన: ఇద్దరు అధికారులు సస్పెండ్!

ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించినందుకుగాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫీసర్ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి కె.సైదులును విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు.
News November 11, 2025
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

వానాకాలం-2025 సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.


