News April 8, 2025
ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.
Similar News
News January 14, 2026
ప.గో: ‘బరి’లో సస్పెన్స్.. పైచేయి ఖాకీదా? ఖద్దరుదా?

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అయితే, ఈ ఏడాది భోగి రోజున ఉదయం 10:40 గంటలు కాస్తున్నా, పందాలకు అనుమతులు లభించలేదు. దీంతో పందెం రాయుళ్లు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పైచేయి ఖాకీదా ? ఖద్దరుదా ? తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం(M) కడియద్ద, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, తాడేపల్లిగూడెంలోని బరులను ధ్వంసం చేశారు.
News January 14, 2026
173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (<
News January 14, 2026
సంక్రాంతి వచ్చిందంటే ఓరుగల్లులో జాతరలే..!

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు ఓరుగల్లు ఆధ్యాత్మికాన్ని పులుముకుంటుంది. ఐనవోలు, కొమురవెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, మేడారం సమ్మక్క-సారలక్క ఇలా ప్రతీ జాతర పెద్ద ఎత్తున సాగుతుంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు సంక్రాంతి పండగకు ఓరుగల్లు వైపు చూస్తారు. ఇక జాతరలతో పాటు పర్యాటక ప్రాంతాలు బోలేడు. ఈ నెలంతా అవి సందర్శకులతో కిటకిటలాడుతాయి.


