News April 8, 2025
MHBD: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహాబూబాబాద్
జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఎం.నరసింహస్వామి నేడు ఒకప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024-25వ సంత్సరానికి గాను జిల్లాలో చదువుతున్న(SC/ST/BC/OC/EBC) విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు మార్చి చివరిలోపు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News April 19, 2025
బొత్స వ్యూహాలు ఫలించేనా

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్లు ఓటింగ్కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?
News April 19, 2025
VJA: లాయర్ల మధ్య వివాదం

విజయవాడ కోర్టులో ఇద్దరు మహిళా న్యాయవాదుల గొడవ పడిన ఘటన చోటు చేసుకుంది. జూనియర్ లాయర్ మనిప్రియ మాట్లాడుతూ.. సీనియర్ లాయర్లు సౌందర్య, పిట్టల శ్రీనివాస్ కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని నిరసన తెలిపారు. సౌందర్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనిప్రియపై 307 కేసు ఉందని, ఆమె జడ్జి ఎదుట అసభ్యంగా మాట్లాడి, బట్టలు చింపుకొని గొడవ చేసిందన్నారు. దీనిపై బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
News April 19, 2025
ముగ్గురు సత్యసాయి జిల్లా వాసులు మృతి.. Update

కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు శ్రీ సత్యసాయి జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరు కర్నాటకలోని రాయచూరు జిల్లాలో గొర్రెల రేటు తక్కువ ఉంటుందని కొనేందుకు బొలేరోలో పయనమయ్యారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో పరిగి మండలం ధనాపురానికి చెందిన నాగభూషణం(42) శీగుపల్లికి చెందిన మురళి(44) కోటిపికి చెందిన నాగరాజు(40) అక్కడికక్కడే మృతి చెందారు.