News April 8, 2025
పెద్దపల్లి: సోలార్ విద్యుత్పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సోలార్ విద్యుత్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. కిలో వాట్కు రూ.30 వేలు, 2 కేడబ్ల్యూకు రూ.60 వేలు, 3 కేడబ్ల్యూకు రూ.78 వేల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు.
Similar News
News January 13, 2026
KNR: పేపర్ లీక్.. 30 మంది ఏఈఓల సస్పెండ్

అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడి దొరికిపోయిన 30 మంది ఇన్ సర్వీస్ ఏఈఓలను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి లీకేజీకి కారణమైన 30 మందితోపాటు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 8 మంది, సిరిసిల్లలో ముగ్గురు, మిగతా వారు వరంగల్, అశ్వారావు పేట, రాజేంద్రనగర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
News January 13, 2026
కళకళలాడనున్న చార్మినార్ పరిసరాలు

HYD అనగానే అందరికీ చార్మినార్ గుర్తొస్తుంది. సిటీకి ఐకాన్గా నిలిచిన దీని పరిసరాలపై కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) అధికారులు దృష్టిపెట్టారు. చూట్టూ వెలుగులు విరజిమ్మేలా LED లైటింగ్ ఏర్పాటుకు RFP టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 27 వరకు గడువు విధించారు. ఈ పనులు పూర్తైతే పాతబస్తీ జిగేల్మంటూ మెరిసిపోతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News January 13, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<


