News April 8, 2025
2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు 71% పూర్తయ్యాయని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఈ ఎయిర్పోర్ట్ ఒక్కటే అధునాతనమైందని, దీంతో దేశ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, 2026 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రి ఇవాళ విమానాశ్రయ పనులను పరిశీలించారు.
Similar News
News September 14, 2025
మైథాలజీ క్విజ్ – 5

1. 8 దిక్కులు మనకు తెలుసు. మరి 10 దిశల్లో మరో రెండు దిశలు ఏవి?
2. గోదావరి నది ఏ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో జన్మించింది?
3. వసంత పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. అంబ ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శిఖండిగా పుట్టింది?
5. జనకుడికి నాగలి చాలులో ఎవరు కనిపించారు? (సరైన సమాధానాలను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
– <<17690127>>మైథాలజీ క్విజ్-4<<>> ఆన్సర్స్: 1.శివుడు 2.రావణుడు 3.కేరళ 4.పూరీ జగన్నాథ ఆలయం 5.వరాహ అవతారం
News September 14, 2025
ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలత, శాంతిని పెంచుతుందని అంటున్నారు. ‘దక్షిణ దిశలో గడియారం ఉంచడం అశుభం. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు’ అని సూచిస్తున్నారు.
News September 14, 2025
AP న్యూస్ రౌండప్

*తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు UNESCO రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు.
*జాతీయ లోక్ అదాలత్లో భాగంగా 60,953 కేసులు పరిష్కారం, రూ.109.99 కోట్ల పరిహారం అందజేత.
*గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు. రెండు ఘటనల్లో నలుగురు మృతి.
*రేపు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలకు విద్యాశాఖ కసరత్తు.
*స్వచ్ఛాంధ్ర పురస్కారాలు.. తొలి విడతలో 16 విభాగాలకు 52 అవార్డులు.