News March 27, 2024

ప్రచురణకర్తలు నుంచి ధ్రువీకరణ పత్రం: కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల పాంప్లెట్ల ముద్రణ, ప్రచారం నిమిత్తం ముద్రించబోయి ఏ పేపర్లు అయినా ప్రచురణకర్తలు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం అందజేయాలని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. ప్రచురణకర్తతో తెలిసిన మరో ఇద్దరితో ధృవీకరణ పత్రం ప్రింటర్లకు ఇవ్వాలన్నారు. ప్రింటర్ కూడా ప్రచురణ కర్త ఇచ్చిన ధృవీకరణ పత్రం, ముద్రించిన దాఖలు నమూనా కాగితాలు 4 కాపీలు 3 రోజులలోగా కలెక్టరు కార్యాలయంలో అందజేయలన్నారు.

Similar News

News February 7, 2025

మీ పిల్లల టాలెంట్‌ని అందరికీ చెప్పాలనుకుంటున్నారా

image

డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, స్పీచ్ ఇలా ఏదైనా మీ పిల్లల్లో ప్రతిభ ఉంటే 5 నిమిషాలు మించకుండా వీడియో తీసి తప్పకుండా ఎడిట్ చేయండి. పిల్లల పేరు, తరగతి, గ్రామం వివరాలతో.. 97036 22022 నంబరుకు వాట్సప్ చేయండి. Way2News ఎంపిక చేసిన ఉత్తమ వీడియోను ప్రతి ఆదివారం సా.6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
➤ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో వచ్చిన వీడియోలనే పరిగణిస్తాం.
➤ 15 ఏళ్ల లోపు పిల్లల వీడియోలే తీసుకుంటాం.

News February 6, 2025

ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

TG భరత్‌కు 15వ ర్యాంకు

image

మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్‌‌కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.

error: Content is protected !!