News April 8, 2025

అదనపు టీచర్ పోస్టులపై CBI విచారణ అనవసరం: సుప్రీం

image

బెంగాల్ టీచర్ నోటిఫికేషన్‌లోని అదనపు పోస్టుల విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 2016లో విడుదలైన నోటిఫికేషన్‌లో 6,861 అదనపు టీచర్ పోస్టుల అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మమతా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ తీర్పును రద్దుచేసింది.

Similar News

News September 14, 2025

మైథాలజీ క్విజ్ – 5

image

1. 8 దిక్కులు మనకు తెలుసు. మరి 10 దిశల్లో మరో రెండు దిశలు ఏవి?
2. గోదావరి నది ఏ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో జన్మించింది?
3. వసంత పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. అంబ ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శిఖండిగా పుట్టింది?
5. జనకుడికి నాగలి చాలులో ఎవరు కనిపించారు? (సరైన సమాధానాలను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
– <<17690127>>మైథాలజీ క్విజ్-4<<>> ఆన్సర్స్: 1.శివుడు 2.రావణుడు 3.కేరళ 4.పూరీ జగన్నాథ ఆలయం 5.వరాహ అవతారం

News September 14, 2025

ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలి?

image

వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలత, శాంతిని పెంచుతుందని అంటున్నారు. ‘దక్షిణ దిశలో గడియారం ఉంచడం అశుభం. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు’ అని సూచిస్తున్నారు.

News September 14, 2025

AP న్యూస్ రౌండప్

image

*తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు UNESCO రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు.
*జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా 60,953 కేసులు పరిష్కారం, రూ.109.99 కోట్ల పరిహారం అందజేత.
*గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు. రెండు ఘటనల్లో నలుగురు మృతి.
*రేపు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలకు విద్యాశాఖ కసరత్తు.
*స్వచ్ఛాంధ్ర పురస్కారాలు.. తొలి విడతలో 16 విభాగాలకు 52 అవార్డులు.