News April 8, 2025

ఇచ్ఛాపురం: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడి మృతి

image

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సూది కొండ వద్ద గుర్తుతెలియని యువకుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 25 ఉంటుందన్నారు. నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 89850 21143 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News April 19, 2025

టెక్కలి జిల్లా ఆసుపత్రి సేవలపై పబ్లిక్ కామెంట్స్

image

➤ <<16135497>>టెక్కలి జిల్లా ఆసుపత్రికి<<>> వచ్చే కేసులను ఎక్కువగా శ్రీకాకుళం రిఫర్ చేయడం➤ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.➤ఆసుపత్రిలో అందరికీ ఫ్యాన్లు,తాగునీరు లేకపోవడం,బెడ్ షీట్లు వేయకపోవడం ➤అత్యవసర ప్రసూతి కేసులపై పర్యవేక్షణ లోపం.➤వేధిస్తున్న అధునాతన వైద్య పరికరాల కొరత ➤ఆసుపత్రిలో రోగులపై కొందరు నర్సులు,సిబ్బంది దురుసు ప్రవర్తన.➤కొన్ని ముఖ్యమైన మందులు కొరత.

News April 19, 2025

నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 19, 2025

సోంపేట: బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం  కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జెసీ, ఆర్డీఓ తదితరులు ఉన్నారు.

error: Content is protected !!