News April 8, 2025
చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.
Similar News
News January 16, 2026
52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్.. సీక్రెట్ చెప్పిన సోనూ సూద్

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్తో ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు సోనూ సూద్. తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేవగానే గోరువెచ్చని నీరు తాగుతానని, అనంతరం రోజూ గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ఇతర వర్కౌట్స్తో పాటు ధ్యానం చేస్తానని తెలిపారు. పెద్దగా డైట్ ఫాలో అవ్వనని, హోమ్ ఫుడ్ని లిమిటెడ్గా తీసుకుంటానని వెల్లడించారు. ఇక షూటింగ్లలో ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానని అన్నారు.
News January 16, 2026
ఖమ్మం: పులిగుండాల చెంత.. పక్షుల కిలకిలరావాలు!

ప్రకృతి ఒడిలో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ‘బర్డింగ్ భారత్’ ఖమ్మం చాప్టర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. జనవరి 18న పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద ‘బర్డ్ వాక్’ నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాగే ఈ నడకలో పక్షుల జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారు రూ. 250 ఫీజు చెల్లించి ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 16, 2026
ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.


