News April 9, 2025
గ్యాస్ ధరల పెంపు.. వారిపై నో ఎఫెక్ట్

TG: కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు వర్తించదు. ధరలు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తానని ప్రకటించడమే దీనికి కారణం. దీంతో ఈ పెంపు ఎఫెక్ట్ మిగిలిన LPG గ్యాస్ వినియోగదారులపై పడనుంది. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలపై అదనపు భారం పడనుండగా 39 లక్షల మహాలక్ష్మి లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ధర రూ.905-రూ.928.50కి చేరింది.
Similar News
News October 29, 2025
రాహుల్ గూండాలా మాట్లాడుతున్నారు: బీజేపీ

ఓట్ల కోసం <<18140008>>డాన్స్<<>> చేయమన్నా చేస్తారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. లోకల్ గూండాలా రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడింది. ‘మోదీకి ఓటు వేసిన దేశంలోని ప్రతి పేద వ్యక్తిని రాహుల్ అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’ అని విమర్శించింది. చొరబాటుదారులకు బహిరంగంగానే ఆయన అండగా నిలుస్తున్నారని ఫైరయింది.
News October 29, 2025
ప్రెగ్నెన్సీలో సూక్ష్మపోషకాలు తీసుకుంటున్నారా?

ప్రెగ్నెన్సీలో అదనపు పోషకాలు తీసుకోవడం తప్పనిసరి. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28రోజుల్లో తీసుకునే ఫోలిక్ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్ D, కాల్షియం అవసరం. విటమిన్ A, అయొడిన్ శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
News October 29, 2025
అలా అయితే బంగ్లాదేశ్కు వెళ్తా: షేక్ హసీనా

భారత్లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్కు మెయిల్లో తెలిపారు. అవామీ లీగ్కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.


