News April 9, 2025
మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే తీవ్రంగా ప్రస్తుత మలేరియా ఉంటుందని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
Similar News
News April 19, 2025
రామప్ప కనుమరుగయ్యే అవకాశం ఉంది: పాండురంగారావు

సింగరేణి ఓపెన్ కాస్ట్కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే రాబోయే రోజుల్లో రామప్ప ఆలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. వెంకటాపూర్లోని ఆలయాన్ని సందర్శించి వారు మాట్లాడారు. రామప్ప దేవాలయం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగి, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం జిల్లాకే గర్వకారణమన్నారు.
News April 19, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
News April 19, 2025
పాలమూరు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

పాలమూరు విశ్వవిద్యాలయం ఏప్రిల్/మే 2025కు సంబంధించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ను అధికారులు విడుదల చేశారు. సెమిస్టర్-II, IV, VI (రెగ్యులర్/బ్యాక్లాగ్), డిగ్రీ బీ.కామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూతో పాటు యూజీ కోర్సులు పరీక్షల టైమ్ టేబుల్ను విడుదల చేశామని, https://www.palamuruuniversity.com/ వెబ్సైట్లో చూడాలన్నారు. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవనున్నట్లు చెప్పారు. SHARE IT