News April 9, 2025

గురుకుల కళాశాలలో ప్రవేశాలకు మే 10న ఎంట్రన్స్ పరీక్ష

image

ఖమ్మం: గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సం.కి ఇంటర్మీడియట్ మొదటి సం. ప్రవేశాలకు మే 10న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల జిల్లా సమన్వయ అధికారిణి రమ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌లలో చేరుటకు మే 10న ఉ.10 నుండి మ.12-30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. www.tgrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 19, 2025

ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

image

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మంజిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతుంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినవస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం కూడా లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?

News April 19, 2025

ఖమ్మం: రేపటి నుంచి పదో తరగతి ఓపెన్ పరీక్షలు

image

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ 2025 థియరీ పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 26 వరకు నిర్వహిస్తున్నట్లు డిఇఓ సోమశేఖర శర్మ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో 1553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.

News April 19, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓:రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ✓: కూసుమంచిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ✓: తల్లాడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ✓:ఏన్కూర్: వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ✓:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓: కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓: పలు శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం ✓: ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

error: Content is protected !!