News April 9, 2025

వరంగల్ మార్కెట్లో రూ.1,000 తగ్గిన టమాటా మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు టమాటా మిర్చి ధర తగ్గింది. సోమవారం టమాటా మిర్చి క్వింటా ధర రూ.28 వేలు పలకగా.. నేడు రూ.27వేలకు పడిపోయింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలకగా.. ఈరోజు రూ.13వేలకు తగ్గింది. 5531 మిర్చికి నిన్నటిలాగే రూ.9 వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 9, 2025

ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌ల‌కు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

News November 9, 2025

చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

image

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.

News November 9, 2025

రూ.318 కోట్లతో ఫుడ్ పార్కులు.. 11న సీఎం శంకుస్థాపన

image

ఏలూరు జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు నవంబర్ 11న వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమలలో రూ.208 కోట్లతో గోద్రెజ్ ఆగ్రోవెట్, నూజివీడులో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,866 మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.