News April 9, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణకు అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తన తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి.. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో ఆమె గొడ్డలితో అతడిపై దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Similar News

News November 12, 2025

HYD: 50 మందికి కార్నియా మార్పిడి.. కొందరు వెయిటింగ్

image

HYDలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి దాదాపు 50 మందికి కార్నియా మార్పిడి చేసి కొత్త జీవితం ప్రసాదించినట్లు తెలిపారు. మరో 50 మంది వరకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. తాజాగా ఆర్టీసీతో ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకోగా గ్రామీణ ప్రాంతాల్లో స్వీకరించిన కార్నియాలను సరోజిని దేవి ఆస్పత్రికి తరలిస్తున్నారు.

News November 12, 2025

విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

image

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.

News November 12, 2025

కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

image

కాణిపాకంలో ఆన్‌లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.