News April 9, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణకు అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తన తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి.. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో ఆమె గొడ్డలితో అతడిపై దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Similar News
News January 14, 2026
ADB: కాంగ్రెస్లో ముదిరిన ‘ఆధిపత్య’ పోరు

జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదనడానికి ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ నియామకం తర్వాత కొత్త పాత నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోతాయని పార్టీ శ్రేణులు అనుకున్నాయి. కానీ ఇటీవల డీసీసీ చేపట్టే కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ఆయన చేపట్టే కార్యక్రమాల్లో నరేశ్ జాదవ్ పాల్గొనకపోవడం జిల్లాలో చర్చకు దారితీసింది.
News January 14, 2026
హన్మకొండ జిల్లాలో తహశీల్దార్ల బదిలీ

జిల్లాలో ఇద్దరు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పరకాల డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ)గా ఉన్న రాజును కాజీపేట తహశీల్దార్గా నియమించారు. కాజీపేటలో పని చేస్తున్న బావుసింగ్ను పరకాల డీఏఓగా బదిలీ చేశారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వెలువడగానే వీరిద్దరూ వెంటనే తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు.
News January 14, 2026
ఆస్టియోపోరోసిస్ ముప్పు వారికే ఎక్కువ

మెనోపాజ్దశలో ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతాన సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతాన లేమి, గర్భస్రావం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


