News April 9, 2025
మహబూబాబాద్: GREAT.. వీధిలైట్ల కింద చదువుకుంటున్న విద్యార్థి

వీధిలైట్ల కింద చదివి గొప్పవారై అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాశారని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే బయ్యారం మండలంలోని జగ్గు తండాలో సన్నివేశాన్ని కనిపించింది. కరెంటు పోయిన సమయంలో వీధిలైటు కింద కూర్చొని చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని Way2News చిత్రీకరించింది. చదువుపై ఆసక్తి ఉంటే ఎక్కడైనా, ఎలాగైనా చదవుకోవొచ్చని, ఈ విద్యార్థి నిరూపించాడు. ఏ స్కూల్ అని అడగగా బయ్యారం ప్రభుత్వ హైస్కూల్ అని సమాధానం ఇచ్చాడు.
Similar News
News April 19, 2025
పల్నాడు జిల్లాకు మహర్దశ

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో జిల్లాను కలపటంతో పల్నాడుకు మహర్దశ పట్టింది. కొండమోడు పేరేచర్ల హైవే పనులు ప్రారంభానికి సిద్ధం కావడంతో అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. కృష్ణానది పరివాహ ప్రాంతం కావడంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, ఎత్తిపోతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, దైద, గుత్తికొండ వంటి పర్యాటక ప్రాంతాలు జిల్లా పరిధిలోకి ఉండటంతో బలమైన జిల్లాగా రూపాంతరం చెందింది.
News April 19, 2025
సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News April 19, 2025
కూకట్పల్లి: 6 రోజుల్లో పెళ్లి అంతలోనే.. SUICIDE

అనారోగ్య సమస్యలతో కూకట్పల్లి హబీబ్నగర్లో <<16143590>>చోటూ<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. మహమ్మద్ చోటూ 4 నెలలుగా వెన్నునొప్పి, కుడి చేతి నొప్పితో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. అది ఎంతకీ తగ్గకపోవడంతో ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 25న పెళ్లి జరగాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.