News April 9, 2025
తెల్కపల్లి: ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన మేస్త్రి బక్కయ్య కొడుకు యశ్వంత్ హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. తన సొంత అవసరాల నిమిత్తం పార్ట్ టైమ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి సరదాగా శామీర్ పేట్ చెరువులోకి ఈతకు వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు కృష్ణతో కలిసి చెరువులోకి దిగగా, ఈత రాక ఇద్దరూ మృతిచెందారు.
Similar News
News November 4, 2025
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News November 4, 2025
అధిష్ఠానం ఇచ్చిన సమాచారంతోనే మాట్లాడా: శ్యామల

కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం కేసులో వైసీపీ నాయకురాలు శ్యామల సోమవారం డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. శివశంకర్ బెల్టు షాపులో మద్యం తాగి ప్రమాదం చేశారన్న ఆరోపణలపై ఆధారాలు అడగ్గా అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకే మాట్లాడానని చెప్పినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఎన్ని కేసులు పెట్టినా, విచారణల పేరుతో ఎన్నిసార్లు తిప్పినా పోరాటం ఆపనని శ్యామల చెప్పారు.
News November 4, 2025
కరీంనగర్: SU B.com, Bsc పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న బి.కాం (బి.ఎస్.ఎఫ్.ఐ) ఈ-కామర్స్, బీ.ఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగంలో 1వ సెమిస్టర్ పరీక్షల <<18189571>>ఫీజు<<>> నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 07 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.


