News April 9, 2025

సైబర్ సేఫ్ జిల్లాగా నంద్యాల: SP

image

నంద్యాల జిల్లాను సైబర్ సేఫ్ జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరని స్పష్టం చేశారు. మహిళలు ఆన్‌లైన్ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల పేరిట విదేశీ నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత వాట్సప్ సందేశాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 19, 2025

పల్నాడు జిల్లాకు మహర్దశ

image

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌లో జిల్లాను కలపటంతో పల్నాడుకు మహర్దశ పట్టింది. కొండమోడు పేరేచర్ల హైవే పనులు ప్రారంభానికి సిద్ధం కావడంతో అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. కృష్ణానది పరివాహ ప్రాంతం కావడంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, ఎత్తిపోతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, దైద, గుత్తికొండ వంటి పర్యాటక ప్రాంతాలు జిల్లా పరిధిలోకి ఉండటంతో బలమైన జిల్లాగా రూపాంతరం చెందింది.

News April 19, 2025

సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

image

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 19, 2025

కూకట్‌పల్లి: 6 రోజుల్లో పెళ్లి అంతలోనే.. SUICIDE

image

అనారోగ్య సమస్యలతో కూకట్‌పల్లి హబీబ్‌నగర్‌లో <<16143590>>చోటూ<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. మహమ్మద్ చోటూ 4 నెలలుగా వెన్నునొప్పి, కుడి చేతి నొప్పితో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. అది ఎంతకీ తగ్గకపోవడంతో ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 25న పెళ్లి జరగాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!