News April 9, 2025
ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్

ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని ఎచ్చెర్ల ఎస్.ఐ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చెరుకూరి తిరుపతమ్మ (21), బేపల అనూష (18) లు ఎచ్చెర్లలోని శక్తి సదన్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం సమయం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ నెంబర్ 63099 90816కు సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు.
Similar News
News September 12, 2025
పెద్దమ్మ కోసం హైదరాబాద్ రైలు ఎక్కిన పలాస బాలుడు

పలాసకు చెందిన ఓ బాలుడు హైదరాబాదులో ఉంటున్న వాళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా గురువారం పలాస రైల్వే స్టేషన్లో విశాఖఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. గురువారం అర్ధరాత్రికి రైలు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన రైల్వే పోలీసులు వివరాలను అడిగగా తనది పలాస అని చెప్పాడు. ఈ బాలుడిని గుంటూరు రైల్వే ఛైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షణలో ఉంచారు.
News September 12, 2025
శ్రీకాకుళం: 27 వరకు ప్యాసింజర్ రద్దు

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మపూర్- విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ (58531, 58532) గల ట్రైన్ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.
News September 12, 2025
SKLM: రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.