News April 9, 2025
ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్

ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని ఎచ్చెర్ల ఎస్.ఐ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చెరుకూరి తిరుపతమ్మ (21), బేపల అనూష (18) లు ఎచ్చెర్లలోని శక్తి సదన్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం సమయం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ నెంబర్ 63099 90816కు సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు.
Similar News
News April 19, 2025
బీచ్ ఫెస్టివల్లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.
News April 19, 2025
శ్రీకాకుళం: చికిత్స పొందుతూ మహిళ మృతి

శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో జరిగిన వంటగ్యాస్ ప్రమాదంలో మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన జామి జయలక్ష్మి మార్చి 19వ తేదీన రాత్రి గ్యాస్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
News April 19, 2025
టెక్కలి జిల్లా ఆసుపత్రి సేవలపై పబ్లిక్ కామెంట్స్

➤ <<16135497>>టెక్కలి జిల్లా ఆసుపత్రికి<<>> వచ్చే కేసులను ఎక్కువగా శ్రీకాకుళం రిఫర్ చేయడం➤ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.➤ఆసుపత్రిలో అందరికీ ఫ్యాన్లు,తాగునీరు లేకపోవడం,బెడ్ షీట్లు వేయకపోవడం ➤అత్యవసర ప్రసూతి కేసులపై పర్యవేక్షణ లోపం.➤వేధిస్తున్న అధునాతన వైద్య పరికరాల కొరత ➤ఆసుపత్రిలో రోగులపై కొందరు నర్సులు,సిబ్బంది దురుసు ప్రవర్తన.➤కొన్ని ముఖ్యమైన మందులు కొరత.