News April 9, 2025

అంబేడ్కర్ కోనసీమ: తల్లిని చూసేందుకు వెళ్తూ మృత్యు ఒడిలోకి

image

తల్లిని చూసేందుకు బైక్‌పై వెళ్తూండగా టిప్పర్ ఢీ కొట్టడంతో తాళ్లపూడి M గజ్జరానికి చెందిన కడలి గోవింద్ (44) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆత్రేయపురం M మెర్లపాలెంలో మంగళవారం జరిగింది. బైక్‌పై వెళ్తున్న గోవిందును టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టిందని ఎస్సై రాము తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. వ్యవసాయం చేసుకునే గోవిందు తల్లిని చూడ్డానికి వెళ్తూ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.

Similar News

News September 18, 2025

నిజామాబాద్, కామారెడ్డి RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి. NZB జిల్లాలో 49, కామారెడ్డిలో 30 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. NZB జిల్లాలో 19, కామారెడ్డి జిల్లాలో 12 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

News September 18, 2025

మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఈవో

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా ఎంఈవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. భోజనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోగా విద్యార్థుల హాజరును మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.